పశ్చిమ నియోజకవర్గం ఆగస్టు 15 : (పి ఆర్ న్యూస్ టుడే) 80వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు అధికారిక, సామాజిక కార్యక్రమాల్లో ప్రభుత్వ విప్, స్థానిక శాసనసభ్యుడు గణబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.నియోజకవర్గ విజన్ కార్యక్రమంతో పాటు జీవీఎంసీ జోనల్ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం, వివిధ ప్రభుత్వ శాఖలు, విద్యాసంస్థలు, కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్లలో ఆయన మువ్వన్నెల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...