గోపాలపట్నం (prnewstoday): సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం అనువంశిక ధర్మకర్త, బోర్డు చైర్మన్, గోవా రాష్ట్ర గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు జన్మదిన వేడుకలు శుక్రవారం విజయనగరంలోని ఆయన అతిథి గృహంలో ఘనంగా జరిగాయి. సింహాచలం దేవస్థానం ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకట్రావు దంపతులు అశోక్ గజపతిరాజుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు సీతారామాచార్యులు, వేద పండితులు వేదమంత్రోచ్చారణల మధ్య ఆశీర్వచనం అందించి, స్వామివారి ప్రసాదాలను సమర్పించారు.
గోపాలపట్నం జూన్ 26 : (pr newstoday) తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసే ఓ పాత నేరస్థుడిని గోపాలపట్నం క్రైమ్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. సింహాచలంలోని ప్రియ గార్డెన్స్ అపార్ట్మెంట్లో కొద్దిరోజుల క్రితం జరిగిన చోరీ మిస్టరీని పోలీసులు వేగంగా చేధించి, మల్కాపురం నివాసి అయిన నూనెల కృష్ణ అనే నిందితుడిని అరెస్ట్ చేశారు. అతని దగ్గరి నుండి పెద్ద ఎత్తున బంగారాన్ని రికవరీ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..