By Nareshkarri111 , 20 August 2026

జీవీఎంసీ జోన్-8 పరిధిలోని పలు ప్రాంతాల్లో అనుమతులు లేని నిర్మాణాలు ఏదేచ్ఛగా సాగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బిల్డింగ్ ప్లాన్ ఆమోదం పొందని, ఖాళీ స్థలాల పన్ను (VLT) చెల్లించని నిర్మాణాలపై క్షేత్రస్థాయి ప్రణాళికా విభాగం సిబ్బంది తగిన రీతిలో స్పందించడం లేదని తెలుస్తోంది. సాధారణ ప్రజలు నిర్మాణాలు చేపడితే కఠినంగా వ్యవహరించే యంత్రాంగం, నిబంధనలు ఉల్లంఘిస్తున్న కొన్ని ప్రాంతాలలో చూసీచూడనట్లు వ్యవహరించడం వెనుక పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనివల్ల కార్పొరేషన్ రావాల్సిన ఆదాయానికి గండి పడటమే కాకుండా, ప్రణాళికారహిత నిర్మాణాలకు దారితీస్తోంది.

By Nareshkarri111 , 20 August 2026

గోపాలపట్నం, ఆగస్టు 20 (PR News Today): వెస్ట్ సబ్ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ACP) శ్రీమతి పి. ప్రదీప్తి బుధవారం గోపాలపట్నం పోలీస్ స్టేషన్‌లో వార్షిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్‌కు సంబంధించిన పలు కీలక రికార్డులను ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు.

By Nareshkarri111 , 19 August 2026

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ‘గాజువాక-సింహాచలం’ మార్గంలో ఈ-బస్ వేయాలి: ఎంపీ శ్రీభరత్‌కు పాశర్ల ప్రసాద్ విజ్ఞప్తి

By Nareshkarri111 , 17 August 2026

పి ఆర్ న్యూస్ టుడే : పురపాలక సంస్థల్లో ఆస్తి బదిలీ (మ్యుటేషన్) ప్రక్రియను సులభతరం చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలను, మున్సిపల్ చట్ట సవరణ బిల్లును విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్  గణబాబు అసెంబ్లీ వేదికగా స్వాగతించారు. మున్సిపాల్ కార్పొరేషన్లు, స్పెషల్/సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీలతో పాటు అన్ని మున్సిపాలిటీలకు ఈ ఆటో-మ్యుటేషన్ విధానాన్ని విస్తరించడం వల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

ఎమ్మెల్యే గణబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు:

By Nareshkarri111 , 16 August 2026

గోపాలపట్నం (విశాఖపట్నం), PR News Today:** మహిళా సాధికారత, వారి ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'స్త్రీ శక్తి' ఉచిత బస్సు ప్రయాణ పథకం విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా విశాఖ పశ్చిమ నియోజకవర్గం గోపాలపట్నంలోని క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్, శాసనసభ్యులు గణబాబు గారి అధ్యక్షతన ప్రత్యేక సమావేశం ఘనంగా జరిగింది.

By Nareshkarri111 , 16 August 2026

పశ్చిమ నియోజకవర్గం ఆగస్టు 15 : (పి ఆర్ న్యూస్ టుడే) 80వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు అధికారిక, సామాజిక కార్యక్రమాల్లో ప్రభుత్వ విప్, స్థానిక శాసనసభ్యుడు గణబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.నియోజకవర్గ విజన్ కార్యక్రమంతో పాటు జీవీఎంసీ జోనల్ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం, వివిధ ప్రభుత్వ శాఖలు, విద్యాసంస్థలు, కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్లలో ఆయన మువ్వన్నెల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...